EVM ల ట్యాంపరింగ్ పై తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు

ఈవీఎంల భద్రతపై తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు. ప్రపంచ చర్చకి నాంది అయింది.

Tulsi Gabbard Video Link
 

ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ ఈవీఎంల భద్రతపై అమెరికా సంస్థలు ప్రస్తావించిన అనుమానాలను వ్యక్తం చేశారు. ఆమె మెకానికల్ టాంపరింగ్ మరియు హ్యాకింగ్ సాధ్యమవుతుందని హెచ్చరించారు. 

ఆమె మాట్లాడుతూ, ఎన్నికలలో వాడే ఈవీఎంల (EVMs) పట్ల నమ్మకాన్ని కోల్పోవడం వల్ల అమెరికాలో పేపర్ బ్యాలెట్ వ్యవస్థపై మళ్లీ ఆసక్తి పెరిగిందని అన్నారు. ఇదే సందర్భంలో భారత్‌ను ప్రస్తావిస్తూ, భారత్ వంటి దేశాలు ఈవీఎంలపై పూర్తిగా ఆధారపడటం ఆందోళన కలిగించే విషయం అని అభిప్రాయపడ్డారు.

 తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యల వెనుక ఉన్న అనుమానాలు:

1. టాంపరింగ్ & 2. హ్యాకింగ్ ఆందోళనలు:
తులసీ గబ్బార్డ్ అభిప్రాయం ప్రకారం, ఈవీఎంలను టాంపర్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాంకేతికంగా సాధ్యమే. ప్రత్యేకించి ఇవి ఇంటర్నెట్‌కు కనెక్ట్ లేక పోయినా, ఫిజికల్ యాక్సెస్ ద్వారా హార్డ్వేర్ లేదా ఫర్మ్‌వేర్ మానిప్యులేషన్ వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చునని భావిస్తున్నారు.


 

EVMలో టాంపరింగ్ ఎలా సాధ్యపడవచ్చు? (సాంకేతిక విశ్లేషణ) 

1. హార్డ్వేర్ టాంపరింగ్ (Hardware Manipulation):

EVMలో ఉన్న మెయిన్ మదర్‌బోర్డ్, మెమొరీ చిప్స్ వంటివి ముందుగా టాంపర్ చేయబడిన కొత్త భాగాలతో బదిలీ చేయవచ్చు.

మానిప్యులేటెడ్ మైక్రోకంట్రోలర్ లేదా ప్రీ-ప్రోగ్రామ్డ్ మెమొరీ చిప్‌లు ద్వారా ఓట్లు ఒక నిర్దిష్ట అభ్యర్థికి వెళ్లేలా కోడ్ మార్చవచ్చు.

ఉదాహరణకు:> ఓటింగ్ 50% దాటిన తర్వాత, ఓటింగ్ మెషీన్ లోపల ఫంక్షన్ మార్చేలా కోడ్ రాయవచ్చు – ఇది "లాజిక్ బాంబ్" లాగా పని చేస్తుంది.

2. ఫర్మ్‌వేర్ మోడిఫికేషన్ (Firmware Manipulation):

ఫర్మ్‌వేర్ అంటే మెషీన్‌లోని నిర్దిష్ట కార్యకలాపాలను నియంత్రించే లో-లెవెల్ సాఫ్ట్‌వేర్. ఒకవేళ తయారీ సమయంలో లేదా రిపేర్ సమయంలో ఫేక్ లేదా మోడిఫైడ్ ఫర్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేయబడితే, అది ఓటర్ల ఎంపికను సామర్థ్యంగా మార్చగలదు.

ఉదాహరణకు:> ఓటర్ “X” అభ్యర్థిని ఎంచుకున్నా, ఫర్మ్‌వేర్ దానిని “Y” అభ్యర్థికి అకౌంట్లో చేస్తుంది.

ముగింపు మాట: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పవిత్రమైన హక్కు.  ప్రజాస్వామ్యంలో నమ్మకం చాలా కీలకం. ఎక్కడైనా కనీసంగా అనుమానాల ఉత్పత్తి అయినా జరిగింది అంటే — భద్రతతో పాటు పారదర్శకత మరింతగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వానికి

జగన్ టివి1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి



కామెంట్‌లు

Aliah Gosu చెప్పారు…
ఇది EVM రిగ్గింగ్ జరిగింది అని ఎలక్షన్ రిజల్ట్స్ ముందు రోజే చెప్పిన.reason RTV రవి ప్రకాశ్ గారు క్లియర్ గా టీడీపీ చేసిన స్కాం బయట పెట్ట కుండా రిజల్ట్స్ డిక్లేర్ చేసినాడు. ఆయన గారు బోర్డు మీద YCP కి 11,జనసేన కి 21, అని క్లియర్ గా చెప్పినాడు. అప్పుడే అర్థం అవుతుంది ఇది ఏవిధం గా రిగ్గింగ్ జరిగింది. ఇది సెంట్రల్ నుండే జరిగింది. జగన్ గారు ఎలక్షన్ అయ్యాక ప్రతీ సారి ఫారిన్ టూర్ మానుకోవాలి. ఇక్కడ జరగాల్సింది అంతా జరుగుతుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కోటరీ మనుషులు తప్పు దోవ పట్టించి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం వేదిక సిద్ధం చేశారు. ఆలు లేదు,sulu లేదు హడావుడి చేసినారు. ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే వరకు ఎలాంటి హంగామా లేకుండా చూసుకోవాలి అని నా అభిప్రాయం

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!